మాస్ రాజా రవితేజ(Ravi Teja) సొంత బ్యానర్ ఆర్.టి.టీమ్ వర్క్స్(RT Team Works) పై ప్రొడ్యూస్ చేసిన మూవీ ఛాంగురే బంగారురాజా (Changure Bangaru Raja). గత నెల సెప్టెంబర్లో రిలీజై మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ లో రిలీజ్ కాబోతుంది. ఈ నెల అక్టోబర్ 27నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హీరో కార్తిక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా సతీష్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన..కామెడీ ఎంటర్టైనర్ అండ్ మర్డర్ మిస్టరీ ఓటీటీలో అలరించే అవకాశం ఉంది.
Changure Bangaru Raja a mysterious fun entertainer premieres Oct 27 only on #ETVWin
— RT Team Works (@RTTeamWorks) October 19, 2023
Watch out for this hilarious and thrilling ride of a murder mystery. ?? ?
#ChangureBangaruRaja #ChangureBangaruRajaETVWinLo #WinThoWinodham #CBROnETVWin@RaviTeja_offl @KarthikRathnam3… pic.twitter.com/vH4ZIDO32n
ఈ మూవీ కథ విషయానికి వస్తే..మోటర్ సైకిల్ మెకానిక్ క్యారెక్టర్ లో నటించిన హీరో కార్తీక్ ది..ఎవరికీ భయపడని నైజం. అతనికి ఉన్న కొద్దిపాటి పొలాన్ని చూసుకుంటూ గడిపేస్తుంటాడు.అతని ఊరు,చుట్టూ ప్రక్కల ఉండే పొలాలన్నీ రంగురాళ్లకి ప్రసిద్ధి. అలా వర్షాలు కురిసినప్పుడు ఊరు ఊరంతా రంగురాళ్ల వేటకి వెళ్తుంది.
అక్కడ ఒకరోజు హీరో కార్తీక్ రత్నంకి..మరొక అబ్బాయికి మధ్య గొడవ జరుగుతుంది కట్ చేస్తే తెల్లవారగానే గొడవ పడిన అబ్బాయి హత్యకి గురవుతాడు. ఆ హత్య కేసు హీరో కార్తీక్ రత్నంపై పడుతుంది.మరి ఆ మర్డర్ నిజంగా హీరో చేశాడా? లేదా మరెవరైనా చేశారా..అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు? అనేది తెలియాలంటే ఛాంగురే బంగారురాజా చూడాల్సిందే.