మాస్ మహారాజ్ టైగర్ నాగేశ్వర రావు సెకండ్ లిరికల్ అప్డేట్

 మాస్ మహారాజ్ టైగర్ నాగేశ్వర రావు సెకండ్ లిరికల్ అప్డేట్

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageshwara rao). భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ(Vamshee) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అంచనాలు అమాంతం పెంచేశాయి. దీంతో టైగర్ నాగేశ్వర రావు సినిమా కోసం రవితేజ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ALSO READ: శృతి హాసన్ కు వేధింపులు..వెంటపడ్డ అగంతుకుడు

లేటెస్ట్ గా  సెకండ్ లిరికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల (సెప్టెంబర్ 21న) వీడు(Veedu )..అనే మాస్ సాంగ్ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. నోట్లో బిడీ .. చుట్టూరా విలన్ గ్యాంగ్ తో రిలీజ్ చేసిన పోస్టర్ చాలా మాస్ గా కనిపిస్తుంది. ఈ మూవీకి తమిళ సంగీత దర్శకుడు జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. 

రీసెంట్గా ఈ మూవీ నుంచి వచ్చిన ఏక్‌‌‌‌ ధమ్.. ఏక్‌‌‌‌ ధమ్ సాంగ్ ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సెకండ్ సింగిల్ తో మాస్ ఆడియన్స్ కు కిక్ ఇస్తుందని తెలుస్తోంది. 
ఇక 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్‌ సనన్‌(Nupur saono) హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళి శర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.