గెలుపు సంబురంలో ఆర్సీబీ ఫ్యాన్స్​ రచ్చ..రచ్చ

గెలుపు సంబురంలో ఆర్సీబీ ఫ్యాన్స్​ రచ్చ..రచ్చ

18 ఏండ్ల తర్వాత మొదటిసారి ఆర్సీబీ ఐపీఎల్​ ట్రోఫీ నెగ్గడంతో స్టార్​ బ్యాటర్ ​విరాట్ ​కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. అర్ధరాత్రి వేళ రోడ్ల మీదకు వచ్చి సంబురాలు చేసుకున్నారు. బైక్​ ర్యాలీలు తీశారు. క్రాకర్స్ ​కాలుస్తూ.. చొక్కాలు విప్పి డ్యాన్సులు చేస్తూ.. నానా హంగామా సృష్టించారు. అమీర్​పేట, కేపీహెచ్​బీ, దిల్​సుఖ్​నగర్, సూరారం, సెక్రటేరియెట్ ​చౌరస్తాలతోపాటు చాలా చోట్ల వెహికల్స్​ను ఆపేసి రచ్చరచ్చ చేశారు. సూరారంలో ట్రాఫిక్​ క్లియర్ ​చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్​ చేయాల్సి వచ్చింది.

 రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్ బెంగళూరు మెగా లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అవతరించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన18వ సీజన్ మెగా ఫైనల్లో ఆర్సీబీ 6  రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. హోరాహోరీ పోరులో తొలుత ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190/9 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (35 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.

 రజత్ పటీదార్ (16 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2 సిక్సర్లతో 26), లియామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లివింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్ (15 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 సిక్సర్లతో 25), జితేష్ శర్మ (10 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24) వేగంగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్​దీప్ సింగ్ (3/40), కైల్ జెమీసన్ (3/48) చెరో మూడు వికెట్లు పడగొట్టారు.  అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసి ఓడింది. శశాంక్ సింగ్ (30 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 61 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఒంటరి పోరాటం వృథా అయింది. ఆర్సీబీ బౌలర్లలో క్రునాల్ (2/17), భువనేశ్వర్ కుమార్ (2/38) చెరో రెండు వికెట్లతో రాణించారు. క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్  ద మ్యాచ్ అవార్డు లభించింది.