
18 ఏండ్ల తర్వాత మొదటిసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. అర్ధరాత్రి వేళ రోడ్ల మీదకు వచ్చి సంబురాలు చేసుకున్నారు. బైక్ ర్యాలీలు తీశారు. క్రాకర్స్ కాలుస్తూ.. చొక్కాలు విప్పి డ్యాన్సులు చేస్తూ.. నానా హంగామా సృష్టించారు. అమీర్పేట, కేపీహెచ్బీ, దిల్సుఖ్నగర్, సూరారం, సెక్రటేరియెట్ చౌరస్తాలతోపాటు చాలా చోట్ల వెహికల్స్ను ఆపేసి రచ్చరచ్చ చేశారు. సూరారంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మెగా లీగ్లో కొత్త చాంపియన్గా అవతరించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన18వ సీజన్ మెగా ఫైనల్లో ఆర్సీబీ 6 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. హోరాహోరీ పోరులో తొలుత ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190/9 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (35 బాల్స్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్గా నిలిచాడు.
రజత్ పటీదార్ (16 బాల్స్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 26), లియామ్ లివింగ్స్టోన్ (15 బాల్స్లో 2 సిక్సర్లతో 25), జితేష్ శర్మ (10 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24) వేగంగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ (3/40), కైల్ జెమీసన్ (3/48) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసి ఓడింది. శశాంక్ సింగ్ (30 బాల్స్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 61 నాటౌట్) ఒంటరి పోరాటం వృథా అయింది. ఆర్సీబీ బౌలర్లలో క్రునాల్ (2/17), భువనేశ్వర్ కుమార్ (2/38) చెరో రెండు వికెట్లతో రాణించారు. క్రునాల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.