కొడంగల్, వెలుగు : కొడంగల్ నియోజకవర్గంలో కాలేజీల ఏర్పాటుకు భూమి కోల్పోతున్న అసైన్డ్ భూముల రైతులకు ఎకరాకు రూ.10 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించిందని ఆర్డీవో శ్రీనివాస్ వెల్లడించారు.
బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మెడికల్, పారా మెడికల్, ఫిజియోథెరఫీ, నర్సింగ్, 220 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మండల పరిధిలోని అప్పాయిపల్లిలో 19 సర్వే నెంబరులోని 75 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ విజయ్కుమార్, డీటీ సురేశ్ కుమార్ పాల్గొన్నారు.