అసైన్డ్  రైతులకు ఎకరాకు రూ. 10 లక్షల పరిహారం : ఆర్డీవో శ్రీనివాస్​

అసైన్డ్  రైతులకు ఎకరాకు రూ. 10 లక్షల పరిహారం : ఆర్డీవో శ్రీనివాస్​

కొడంగల్, వెలుగు :  కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో  కాలేజీల ఏర్పాటుకు భూమి కోల్పోతున్న అసైన్డ్ భూముల  రైతులకు ఎకరాకు రూ.10 లక్షల పరిహారాన్ని  ప్రభుత్వం ప్రకటించిందని ఆర్డీవో  శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వెల్లడించారు.  

బుధవారం తహసీల్దార్​ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.  మెడికల్, పారా మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఫిజియోథెరఫీ,  నర్సింగ్,  220  పడకల ఆసుపత్రి నిర్మాణానికి మండల పరిధిలోని అప్పాయిపల్లిలో 19  సర్వే నెంబరులోని 75 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్​ విజయ్​కుమార్, డీటీ సురేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.