రెడ్డి నాయక్ తండాలో ఎన్నికల బహిష్కరణ

రెడ్డి నాయక్ తండాలో ఎన్నికల బహిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండా పరిధిలోని మీటీ నాయక్ తండలో ఎన్నికలను బహిష్కరించారు గ్రామస్థులు. ‌‌తమ గ్రామాన్ని ఇంతవరకు ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని పట్టించుకోలేదని ..ఎలాంటి నిధులూ ఇవ్వలేదని ఎన్నికలను బహిష్కరించారు. ఓటు వేయడానికి పక్క గ్రామానికి వెళ్లాలి అని ప్రశ్నించారు. కనీసం తనకు ఓటు హక్కు కోసం ఏ అధికారి కూడ తమ గ్రామానికి రాలేదని అన్నారు..తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఓటు వేసేది లేదని తండావాసుల తేల్చి చెప్పారు.