పంజాబ్, హర్యానాలో తగ్గిన వరదనీరు

పంజాబ్, హర్యానాలో తగ్గిన వరదనీరు

చండీగఢ్​: పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టిందని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రెండు రాష్ట్రాల అధికారులు శనివారం వెల్లడించారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున, తగిన నివారణ చర్యలు చేపట్టినట్లు హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. కాగా, గత వారం భారీ వర్షాల కారణంగా పంజాబ్ లో 19 మంది, హర్యానాలో 20 మంది చనిపోయారు.