మంత్రి కోమటిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నల్గొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2014లో వెంకట్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. వెంకట్రెడ్డిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను విచారణ అనంతరం రద్దు చేస్తూ తీర్పు చెప్పారు.
అలాగే.. ప్రొటోకాల్ ఉల్లంఘన కేసులో రూ.4200 జరిమానా విధిస్తూ 2021లో ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల విచారణ ప్రత్యేక కోర్టు.. వెంకట్రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది.