తమిళనాడులో సమ్మె చేస్తున్నారు ప్రభుత్వ డాక్టర్లు. సమ్మెపై తీవ్రంగా స్పందించారు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్. వెంటనే విధుల్లో చేరకపోతే వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని 15 వేలమంది ప్రభుత్వ డాక్టర్లు గత శుక్రవారం నుంచి సమ్మె చేస్తున్నారు. దీన్నీ సీరియస్ గా తీసుకున్న మంత్రి విజయభాస్కర్…ప్రజలకు ఇబ్బంది కలిగేలా డాక్టర్లు సమ్మె చేస్తున్నారని…వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. విధుల్లో చేరకపోతే వారి స్థానంలో కొత్త డాక్టర్లు ఉద్యోగాల్లో చేరుతారని స్పష్టం చేశారు. అంతేకాదు సమ్మె చేస్తున్న వారిని తొలగిస్తామని హెచ్చరించారు.