
ఇస్లామాబాద్: భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తత లు కాస్తా తగ్గుముఖ పడుతున్న వేళ దాయాది దేశానికి భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా తమ భూభాగాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్ పై పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది.
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో బలూచిస్తాన్ రచయిత మీర్ యార్ బలూచ్..రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు. న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరాడు. శాంతి పరిరక్షణ దళాల కోసం ఐక్యరాజ్యసమితికి విజ్ణప్తి చేశారు. పాకిస్తాన్ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
100 కి పైగా గ్యాస్ బావులు ఉన్న దేరా బుగ్టిలోని పాకిస్తాన్ గ్యాస్ క్షేత్రాలపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేశారని మీర్ యార్ బలూచ్ సోషల్ మీడియా ప్రకటించారు. ఉగ్రవాద పాకిస్తాన్ పతనం దగ్గర పడింది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే చేస్తాం.. మేం మా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాం.. ఢిల్లీలో బలూచిస్తాన్ అధికారిక కార్యాలయం,రాయబార కార్యాలయాన్ని అనుమతించాలని భారతదేశాన్ని కోతున్నామని మీర్ యార్ బలూచ్ తెలిపారు.
బలూచిస్తాన్, పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్ దీర్ఘకాలంగా స్వాతంత్ర్య ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. తమ సహజ వనరుల దోపిడీ, రాజకీయ హక్కుల ఉల్లంఘన, పాక్ సైన్యం చేస్తున్న అణచివేతలపై బలూచ్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
తమ హక్కుల కోసం బలూచ్ లిబ రేషన్ ఆర్మీ ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా కొనసాగుతోంది. ఇది పాకిస్తాన్ సైన్యంతో పాటు మౌలిక సదుపాయాలపై
దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు స్వతం త్రదేశంగా అవతరించినట్లు ప్రకటించుకుంది.
నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని క్వెట్టాలో కొత్త పార్లమెంట్ కు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోలను బలూచిస్తాన్ రిలీజ్ చేసింది. అలాగే, భారత్ సహా ఇతర దేశాలు తమ కొత్త బలూచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలను ఏర్పాటు చేయాలని కోరింది.