పీఏసీఎస్ కోఆప్షన్ సభ్యుడి ఎన్నికకు తీర్మానం

పీఏసీఎస్ కోఆప్షన్ సభ్యుడి ఎన్నికకు తీర్మానం

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ పీఏసీఎస్​పాలక కమిటీలో 6వ టీసీ డైరెక్టర్​పోస్టు 3 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. దానికి కోఆప్షన్ మెంబర్​ను ఎన్నుకునేందుకు మంగళవారం పీఏసీఎస్ ​ఆఫీస్​లో సీఈఓ మగ్దూం అధ్యక్షతన చైర్మన్​ దూదిపాల నరేందర్​రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది డైరెక్టర్లతో మీటింగ్​జరిగింది. కోఆప్షన్​ సభ్యుడిని ఎన్నకునేందుకు డీసీఓను అనుమతి కోరుతూ తీర్మానం చేసి పంపించారు.

చైర్మన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్​పార్టీకి చెందిన డైరెక్టర్లు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొంతమంది డైరెక్టర్లు వేర్వేరుగా మంతనాలు జరుపుతున్నారు.  6వ టీసీ డైరెక్టర్​పోస్ట్​కు గతంలో రాజీనామా చేసిన చాగల్లుకు చెందిన ఇద్దరు బీఆర్ఎస్​ నాయకుల పేర్లను బీఆర్ఎస్​డైరెక్టర్లు కొందరు ప్రతిపాదించగా

కాంగ్రెస్ కు చెందిన కొందరు డైరెక్టర్లు రాఘవాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి పేరును ప్రతిపాదిస్తున్నారని తెలిసింది. సహకరించకుంటే పీఏసీఎస్​చైర్మన్​పై అవిశ్వాసం పెడతామని కొందరు బాహటంగా చెబుతున్నారు