ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేతలను రేవంత్ కలుస్తున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన రేవంత్ .. కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఎల్బీ స్టేడియంలో రేపు జరగబోయే తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా కోరారు. మరికాసేపట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను కలిసి వారిని కూడా ఆహ్వానించనున్నారు. అనంతరం మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు.
#WATCH | Telangana CM elect Revanth Reddy arrives at the residence of Congress President Mallikarjun Kharge in Delhi pic.twitter.com/bDAcNI6pOw
— ANI (@ANI) December 6, 2023
మరోవైపు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. 2023 డిసెంబర్ 07వ తేదీ గురువారం ఉదయం 10.28 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రేవంత్ సహా 9 లేదా 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. సీఎంగా రేవంత్ తోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 12 మంది మంత్రులూ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. బుధవారం హైకమాండ్ భేటీలో వీటిపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. కేబినెట్లో చోటుదక్కించుకునేది వీళ్లేనంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.