తక్షణమే లక్ష రుణమాఫీ చేయాలి..కేసీఆర్ కు రేవంత్ లేఖ

తక్షణమే లక్ష రుణమాఫీ చేయాలి..కేసీఆర్ కు రేవంత్ లేఖ

వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. ఇదే విషయమై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు రేవంత్. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉందన్నారు. వేల కోట్ల పెట్టుబడి వరద పాలైందని లేఖలో పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలు క్షేత్ర స్థాయికి అధికారుల బృందాలను పంపించి నష్టం అంచనా వేసేవన్నారు. కానీ TRS అధికారంలోకి వచ్చాక అలాంటి ప్రక్రియ ఏనాడూ చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అటకెక్కించారన్నారు రేవంత్. పంటల బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు రేవంత్. హుజురాబాద్ ఎన్నికల కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్ కు..రైతుల గోస పట్టకపోవడం శోచనీయం అన్నారు. తక్షణమే లక్ష రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.