తెలంగాణ హైకోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పిటిషన్ వేశారు. తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాల కోసం హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. తనపై ఎన్ని కేసులున్నాయో తెలపాలంటూ రేవంత్ 2023 అక్టోబర్ 3న డీజీపీని కోరారు రేవంత్.
అయితే తన వినతిపత్రంపై డీజీపీ స్పందించకపోవడంతో హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. అక్టోబర్ 16లోగా కేసుల వివరాలను రేవంత్ రెడ్డికి ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. కేసులపై ఎలాంటి సమాచారం లేకపోతే నామినేషన్ ఎలా వేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది.