
కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ మోకాలికి డాక్టర్లు శస్త్ర చికిత్స చేశారు. ముంబైలోని ఆసుపత్రిలోనే పంత్ మోకాలి లిగమెంట్లకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిందని బీసీసీఐ వెల్లడించింది.
పంత్ మోకాలి లిగమెంట్లకు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో సక్సెస్ ఫుల్గా సర్జరీ అయింది. ప్రస్తుతం పంత్ను డాక్టర్లు పరిశీలనలో ఉంచారు. అయితే రాబోయే రోజుల్లో ఏం చేయాలి.. రిహాబిలిటేషన్కు ఎప్పుడు పంపించాలి అనేది డాక్టర్ దిన్షా పార్ధీవాలా నేతృత్వంలోని వైద్యబృందం తెలపనుంది.
ఉత్తరాఖండ్లోని రూర్కీలో కారు ప్రమాదంలో రిషభ్ పంత్ గాయపడ్డాడు. అతని తలకు రెండు గాట్లతో పాటు మోకాలిలోని లిగమెంట్లలో చీలిక ఏర్పడింది. ఈ గాయాల నుంచి పంత్ కోలుకోవడానికి కనీసం 9 నెలలు పడుతుందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అతని మోకాలి లిగమెంట్లకు ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది.