దారుణం.. ఆర్టీసీ బస్సు ఢీ కొని ఇద్దరు విద్యార్థులు మృతి

దారుణం.. ఆర్టీసీ బస్సు ఢీ కొని ఇద్దరు విద్యార్థులు మృతి

బోడుప్పల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆర్టీసీ బస్సుకు ఢీ కొని మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రతాప సింగారం వద్ద జరిగింది. విద్యార్థులు మేడ్చెల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ జానవి డిగ్రీ కాలేజీకి చెందిన భూమా సాయి, అనితగా గుర్తించారు. 

జూన్ 30వ తేదీ శుక్రవారం కాలేజీ ముగిశాక.. బైక్ పై ఇంటికి బయల్దేరిన విద్యార్థలు ప్రతాపసింగారం ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ఆర్టీసీ బస్సును వేగంగా ఢీ కొట్టారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తప్పిందం ఎక్కడ జరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.