పాల వ్యాన్ ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

పాల వ్యాన్ ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లా: యాచారం మండలం గున్ గల్ నాగార్జున సాగర్ రోడ్డుపై పాల వ్యాన్ ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన వేముల సురేష్ గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.