వాటర్ తీసుకురావడానికి వెళ్తుండగా ప్రమాదం.. బాలుడి మృతి

వాటర్ తీసుకురావడానికి వెళ్తుండగా ప్రమాదం.. బాలుడి మృతి

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోలోని మహాలక్ష్మి నగర్ కు చెందిన చౌటపల్లి శివ కార్తీక్ ( 12)  అనే బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మే 8వ తేదీ సోమవారం రాత్రి స్కూటీపై డ్రింకింగ్ వాటర్ తీసుకురావడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దేవిశ్రీ గార్డెన్ సమీపంలోని బైపాస్ రోడ్ లో శివ కార్తీక్ స్కూటీ డివైడర్ ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.

గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయాడు. శివ కార్తిక్ తండ్రి పది సంవత్సరాల తర్వాత సౌదీ అరేబియా నుండి సోమవారం రాత్రి ఇండియాకు వచ్చాడు. కుటుంబంతో సంతోషంగా గడుపుదామనుకున్న సమయంలో.. కన్న కొడుకు మృత్యు వాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మన్నీరుగా రోధిస్తున్నారు.