సికింద్రాబాద్​ లో రోడ్డు ప్రమాదం..తోపుడు బండిని ఢీకొన్న కారు

సికింద్రాబాద్​ లో రోడ్డు ప్రమాదం..తోపుడు బండిని ఢీకొన్న కారు
  • తీవ్రంగా గాయపడిన బాధితుడు

  • పరారీలో డాక్టర్​


 హైదరాబాద్‌: సికింద్రాబాద్​ లోని   బొల్లారం పరిధిలో ఇవాళ( ఫిబ్రవరి 22)  తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అధిక స్పీడ్​ తో వచ్చిన కారు అక్కడున్న తోపుడు బండ్లపైకి దూసుకెళ్లింది. అయితే కారును ఓ డాక్టర్​నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో సయ్యద్‌ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే  స్థానికులు కారును అడ్డగించి డాక్టర్​ను  పట్టుకున్నారు. తన ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని చెప్పి బాధితుడిని కారులో తీసుకెళ్లాడు.  అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పాషాను చేర్పించి అక్కడి నుంచి డాక్టర్​ పరారయ్యాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని, బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబసభ్యులు వాపోయారు.  ఓ ఆస్పత్రిలో న్యూరోసర్జన్‌ గా ఆ డాక్టర్​ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.