-
తీవ్రంగా గాయపడిన బాధితుడు
-
పరారీలో డాక్టర్
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని బొల్లారం పరిధిలో ఇవాళ( ఫిబ్రవరి 22) తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అధిక స్పీడ్ తో వచ్చిన కారు అక్కడున్న తోపుడు బండ్లపైకి దూసుకెళ్లింది. అయితే కారును ఓ డాక్టర్నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో సయ్యద్ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కారును అడ్డగించి డాక్టర్ను పట్టుకున్నారు. తన ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని చెప్పి బాధితుడిని కారులో తీసుకెళ్లాడు. అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పాషాను చేర్పించి అక్కడి నుంచి డాక్టర్ పరారయ్యాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని, బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబసభ్యులు వాపోయారు. ఓ ఆస్పత్రిలో న్యూరోసర్జన్ గా ఆ డాక్టర్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.