టైరు పేలింది : బస్సు ప్రమాదంలో 16 మంది మృతి

టైరు పేలింది : బస్సు ప్రమాదంలో 16 మంది మృతి

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలి ఎదురుగా వస్తున్న కారును మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 16 మంది అక్కడికక్కడే చనిపోయారు.

మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు..గాయపడ్డవారిని సమీప హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. కొంతమంది పరిస్ధితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు స్థానికులు.