ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బ‌స్సు, డీసీఎం ఢీ

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బ‌స్సు, డీసీఎం ఢీ

ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొన్న ఘటనలో ప‌లువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో పాలేరు వైపు వెళ్తుండగా… పాలేరు జలాశయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డీసీఎం ఫ్రంట్ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డీసీఎం డ్రైవర్ సహా బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది గాయపడ్డారు. అందరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తర్వాత రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఉన్న డీసీఎం,బస్సును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.