దుబాయ్: 2021లో చేసిన పెర్ఫామెన్స్ ఆధారంగా ఐసీసీ ఎంపిక చేసిన టీమ్స్కు పలువురు ఇండియా ప్లేయర్లు సెలెక్ట్ అయ్యారు. ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్లో స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ ప్లేస్ సాధించారు. ఓపెనర్గా రోహిత్, కీపర్గా పంత్, ఏకైక స్పిన్నర్గా అశ్విన్ ఎంపియ్యారు. అయితే, ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్లో ఇండియా నుంచి ఒక్కరికి కూడా చాన్స్ దక్కలేదు. ఇప్పటికే ప్రకటించిన టీ20 జట్టుకు కూడా మనోళ్లు ఎంపికవ్వలేదు. వన్డేల్లో చిన్న టీమ్ ఐర్లాండ్ నుంచి ఇద్దరికి చాన్స్ వచ్చినా.. ఇండియన్స్కు ప్లేస్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక, విమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్లో లెజెండరీ ప్లేయర్స్ మిథాలీ రాజ్, జులన్ గోస్వామి చోటు సాధించారు.