చాలెంజ్​లో నెగ్గినోళ్లకు రూ. 8.50 లక్షల ప్రైజ్ మనీ

చాలెంజ్​లో నెగ్గినోళ్లకు రూ. 8.50 లక్షల ప్రైజ్ మనీ

 

  • మోడీ థాలీకి భలే గిరాకీ
  • చాలెంజ్​లో నెగ్గినోళ్లకు రూ. 8.50 లక్షల ప్రైజ్ మనీ
  • ఢిల్లీ రెస్టారెంట్ బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ యజమాని ప్రధాని నరేంద్ర మోడీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ‘మోడీ బాహుబలి 56 థాలీ’ పేరుతో ప్రధానికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. ఆ థాలీ తిన్నోళ్లకు రూ.8.5 లక్షల ప్రైజ్​ ప్రకటించారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఢిల్లీ కన్నాట్‌‌ప్లేస్‌‌లోని  ‘అర్డోర్ 2.0’ రెస్టారెంట్ యజమాని సమిత్ కల్రా ఈ థాలీని అందుబాటులోకి తెచ్చారు. వాస్తవానికి ఈ థాలీని మోడీకే బహుమతిగా ఇవ్వాలని, ఆయన తమ రెస్టారెంట్‌‌కు రావాలని కోరుకున్నారు. కానీ, సెక్యూరిటీ కారణాల వల్ల ఆ థాలీని అభిమానులకు కేటాయించారు.

ఛెప్పన్​ ఇంచ్​కా ఛాతీ

ఛెప్పన్ ఇంచ్ కా ఛాతీ ‘56 అంగుళాల ఛాతీ కలిగిన మోడీ జీ’ పేరుతో గ్రాండ్ థాలీని తయారు చేశారు. ఇందులో 56 రకాలు వంటకాలు ఉంటాయి. వెజ్(రూ.2600), నాన్‌‌ వెజ్​(రూ.2900) రకాల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. ఒక్కరైనా, జంటగా అయినా ఈ థాలీని ఆరగించొచ్చు. అయితే, దీనిని 40 నిమిషాల్లోగా పూర్తి చేసినోళ్లకు రూ.8.5 లక్షల ప్రైజ్ మనీ ఆఫర్ పెట్టారు. లక్కీ డ్రాలో గెలిచినోళ్లకు  కేదార్‌‌నాథ్‌‌కు ఫ్రీ ట్రిప్ ఆఫర్ చేస్తున్నారు. దీంతో థాలీ టేస్ట్ చూసేందుకు ఫుడ్ లవర్స్ రెస్టారెంట్​కు క్యూ కడుతున్నారు. థాలీ తినేందుకే తన స్నేహితుడితో కలిసి బెంగళూరు నుంచి ఢిల్లీ వచ్చినట్లు యూట్యూబర్ లోహిత్ ‘వీ6 వెలుగు’తో పంచుకున్నారు.