మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన బస్సు..ఇద్దరికి గాయాలు

మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన బస్సు..ఇద్దరికి గాయాలు

హైదరాబాద్ లోని మలక్ పేట్ లో క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు ముందు భాగం దెబ్బతింది. ఆటో ను తప్పించపోయి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.  ప్రమాదంతో రోడ్ పై వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను క్లియర్ చేశారు. 

భారత్, అమెరికా మధ్య ప్రవాసులే వారధి

నీళ్లు ఇవ్వకుంటే మూత్రం తాగేసే వాళ్లం