నడుస్తున్న వారిని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు

నడుస్తున్న వారిని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు

తుర్కయాంజల్: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ రహదారి పై రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదచారులను ఇబ్రహీంపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని 108లో సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.