ప్యాసింజర్లు, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

 ప్యాసింజర్లు, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్, వెలుగు: ప్యాసింజర్లు, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ఈ ఏడాది మరింత ప్రాధాన్యం ఇస్తామని, సమస్యలు కూడా ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరిస్తుందని ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ ఏడాదిని ప్రయాణికుల సంక్షేమం కోసం అంకితం చేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఎంజీబీఎస్ లో ప్యాసింజర్లు, ఆర్టీసీ సిబ్బందితో సజ్జనార్​ న్యూ ఇయర్ కేక్  కట్ చేశారు. అక్కడే ఉన్న ప్యాసింజర్లతో మాట్లాడి.. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. గతేడాది ఆర్టీసీని ప్యాసింజర్స్ బాగా ఆదరించారని, రాఖీ పౌర్ణమి రోజు రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల ఆమ్దానీ వచ్చిందన్నారు.

ఈ ఏడాది కూడా ఆర్టీసీని ఆదరించాలని కోరారు. ప్యాసింజర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్రజారథాన్ని ప్రారంభించారు. ఎన్నో ఏండ్లుగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్న పలువురు ప్యాసింజర్స్​ను ఎండీ సన్మానించారు.