ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా సమీక్ష

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా సమీక్ష

రానున్న మార్చి 15 వ తేది నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నామినల్ రోల్స్ నుండి పరీక్షలు పూర్తి అవ్వడంతో పాటు ఫలితాలను వెల్లడించేనాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుచేయాలని సూచించారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు ఉతీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డు ఇన్ చార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.