బీసీసీఐ ప్రెసిడెంట్గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న సౌరవ్ గంగూలీకి మాజీ క్రికెటర్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తోపాటు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ కైఫ్ అభినందనలు తెలియజేశారు. కెప్టెన్గా ఇండియాను ముందుకు తీసుకెళ్లినట్టుగా బోర్డును కూడా నడిపిస్తాడన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ‘బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నికైన దాదాకు కంగ్రాట్స్. ఎప్పటిలానే ఇండియన్ క్రికెట్కు సేవలందిస్తావని ఆశిస్తున్నా. బోర్డు కొత్త జట్టుకు కూడా శుభాకాంక్షలు’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. ‘దాదాకు శుభాకాంక్షలు. ఇండియన్ క్రికెట్కు ఇది శుభసూచికం.
గతంలో ఇండియన్ క్రికెట్కు నువ్వు అందించిన విలువైన సేవలకు ఇది కొనసాగింపుగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ‘ బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నికైన గంగూలీకి శుభాకాంక్షలు. నీ నాయకత్వంలో ఇండియన్ క్రికెట్ కచ్చితంగా మరింత ప్రగతి సాధిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ కొత్త పాత్రలో కూడా నీకు అంతా విజయమే కలగాలని కోరుకుంటున్నా’ అంటూ హైదరాబాదీ స్టయిలిష్ ప్లేయర్ లక్ష్మణ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపిన దాదా.. నీ సహకారం చాలా అవసరమంటూ వీవీఎస్కు బదులిచ్చాడు. ‘ప్లేయర్ నుంచి కెప్టెన్.. కెప్టెన్ నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్.. శుభాకాంక్షలు దాదా. నీ నుంచి చాలా ఆశిస్తున్నాం’ అంటూ మరో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు.