ఫ్యామిలీతో ఓటేసిన సచిన్ టెండూల్కర్

 ఫ్యామిలీతో ఓటేసిన సచిన్ టెండూల్కర్

ముంబై: దేశవ్యాప్తంగా సోమవారం 8 రాష్ర్టాల్లో నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ముంబైలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సతీమణి అంజలి, కుమారుడు అర్జున్‌, కూతురు సారాతో కలిసి బాండ్రాలో ఓటు వేశారు. బాలీవుడ్‌ స్టార్‌ సెలబ్రిటీలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అమితాబ్‌-జయా బచ్చన్‌, ఐష్‌-అభిషేక్‌ దంపతులు జుహూలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. సల్మాన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ బాండ్రాలోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 283 లో ఓటు వేశారు. సెలబ్రిటీలంతా ఓటేసిన తర్వాత పోలింగ్‌ కేంద్రం వద్ద సిరా గుర్తును మీడియాకు చూపించారు. ఓటర్లంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తారలంతా విజ్ఞప్తి చేశారు.