చిత్రలహరికి క్లీన్ U : సాయి ధరమ్ సక్సెస్ కొడతాడా..?

చిత్రలహరికి క్లీన్ U : సాయి ధరమ్ సక్సెస్ కొడతాడా..?

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. రీసెంట్ గా రిలీజైన చిత్రలహరి ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ టీమ్ క్లీన్ యూ సర్టిఫికెట్ ను ఇచ్చింది. కిశోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పాటలు కూడా పాపులర్ అయ్యాయి.

లో-ప్రొఫైల్ క్యారెక్టరైజేషన్ లో సాయి ధరమ్ తేజ్ 

నేను శైలజతో హిట్టుకొట్టిన డైరెక్టర్ కిశోర్ తిరుమల… ఉన్నది ఒక్కటే జిందగీ పరాజయం తర్వాత చిత్రలహరితో వస్తున్నాడు. గతంలో తన సినిమాల్లో హీరోలను చూపించినట్టుగానే… ఈ సినిమాలోనూ హీరో సాయి ధరమ్ తేజ్ ను పక్కింటి కుర్రాడు టైప్ క్యారెక్టర్ లో చూపించాడు డైరెక్టర్. 2016లో సుప్రీమ్ సినిమా తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో సాయిధరమ్ తేజ్ యాక్షన్ ప్రధాన పాత్రల్లో నటించాడు. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్యూ లాంటి సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి. టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేసినా కూడా… సాయి ధరమ్ కు కలిసి రాలేదు. దాదాపు గా అన్ని సినిమాల్లోనూ హీరోయిజం ఉట్టిపడే క్యారెక్టర్లు చేశాడు. ఇపుడు.. కాస్త లో-ప్రొఫైల్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. లేటెస్ట్ గా చిత్రలహరి ట్రైలర్ లో సాయిధరమ్ తేజ్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తనకు పక్కాగా హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.

ఈ సినిమాలో నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు . మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు.