ఈ రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. మాట మీద నిలబడే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వాడే మన సుప్రీం హీరో సాయి థరమ్ తేజ్. ఇచ్చిన మాట నిలబెట్టుకుని రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.
అసలేం జరిగిందంటే.. ఏడాది క్రితం అమ్మ ప్రేమ ఆదరణ అనే సేవ సంస్థ ఓల్డేజ్ హోం నిర్మాణానికి సాయం చేయాలని ట్విట్టర్లో సాయిథరమ్ తేజ్, పవన్ కళ్యాణ్, ఉపాసన కొణిదెల,సమంత, మంచులక్ష్మిలను ట్యాగ్ చేసింది. దీనిపై స్పందించిన సాయిథరమ్ ఆ ఓల్డేజ్ హోం నిర్మాణానికి సంవత్సరం వరకు స్పాన్సర్ షిప్ ఇస్తానని మాటిచ్చాడు
అంతేగాకుండా తన పుట్టిన రోజు నాడు ఫ్లెక్సీలు,బ్యానర్లు కట్టకుండా ఆ డబ్బును తనకు సాయం చేయాలని అభిమానులను కోరాడు. అభిమానులంతా చందాలు వేసి దాదాపు లక్షరూపాయల వరకు ఇచ్చారని చెప్పాడు. మిగతా డబ్బులు సాయిథరమ్ తేజ్ సాయం చేయడంతో ఆ అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ వారు బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
This is the best birthday gift I could give ?? …thanks to everyone who made me help so many people and to all the fans who helped me out in this small project and donated in their small ways…I’m indebted to them…thank you once again ?? https://t.co/w03ILRsgGG pic.twitter.com/O4ZffMDUcZ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 15, 2019