రేపటి నుంచి ప్రారంభం కానున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌

రేపటి నుంచి ప్రారంభం కానున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌

ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలను పాకిస్తాన్ నిలిపేసింది. అయితే ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి భారత్, పాక్ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. వింగ్ కమాండర్ అభినందన్ ను.. భారత్‌కు అప్పగింత కార్యక్రమం పూర్తైన తర్వాత ఇరు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 3న మొదటి రైలు ఢిల్లీ నుంచి బయలుదేరనుందని.. తిరిగి సోమవారం లాహోర్ నుంచి రిటర్న్ కానుందని రైల్వే అధికారులు తెలిపారు.