
- కింగ్పిన్గా సీఎం అర్వింద్ కేజ్రీవాల్
- చార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ అధికారులు
- ఓ కేసులో పార్టీ పేరు చేర్చడం ఇదే ఫస్ట్ టైమ్
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్పై ఈడీ అధికారులు చార్జ్షీట్ దాఖలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఓ కేసులో పార్టీని నిందితుడిగా చేర్చడం ఇదే ఫస్ట్ టైమ్. నిందితులందరిపై మనీలాండరింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం అభియోగాలు మోపినట్టు స్పెషల్ కోర్టులో ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ను కింగ్పిన్, కీలక కుట్రదారుగా చార్జ్షీట్లో పేర్కొన్నది. ఈ కేసులో ఇప్పటిదాకా మొత్తం 8 చార్జ్షీట్లు ఈడీ దాఖలు చేసింది. కాగా, మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు. ఈ కేసులో మొత్తం 18 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ గవర్నమెంట్లోని మంత్రులు, ఆప్ నేతలు, ఇతర వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేజ్రీవాల్ సెవెన్ స్టార్ హోటల్లో స్టే చేసినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఈ కేసులోని నిందితులే ఆయన బిల్లులో కొంతవరకు చెల్లించినట్టు సుప్రీం కోర్టుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు సుప్రీం కోర్టుకు ఇప్పటికే వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ నేషనల్ కన్వీనర్గా ఉన్నారని తెలిపారు.
సుప్రీం పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ కేసులో అటు కేజ్రీవాల్, ఇటు ఈడీ అధికారుల వాదనలు విన్నది. ఈమేరకు తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. పిటిషనర్ చట్టానికి అనుగుణంగా బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి, ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.