హైదరాబాద్లో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..రెండు రోజుల్లో 604మందిపై కేసులు

హైదరాబాద్లో వీకెండ్ డ్రంక్ అండ్  డ్రైవ్ తనిఖీలు..రెండు రోజుల్లో 604మందిపై కేసులు

హైదరాబాద్​ సిటీలో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ పై ట్రాఫిక్​ పోలీసులు స్పెషల్​ ఫోకస్​ పెట్టారు.  జీరో టాలరెన్స్​ విధానంలో తాగి బండి నడిపినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీకెండ్స్​లో నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై  కేసులు నమోదు చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో  హైదరాబాద్​నగర వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో 604మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్​ ట్రాఫిక్​ జాయింట్ సీపీ జోయల్​ డేవీస్​ తెలిపారు. 

రెండు రోజులుగా నగరవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో 604 మంది  వాహనదారులపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో బైకర్స్​ ఎక్కువగా ఉన్నారు. 492 మంది బైకిస్టులు, 42 మంది ఆటో డ్రైవర్లు, 70 మంది ఫోర్​ వీలర్స్​ ఇతర వాహన దారులపై కేసులు నమోదు చేశారు.  వీరంతా అధికమొత్తంలో మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు పోలీసులు చెప్పారు. 

ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారుల్లో రక్తంలో ఆల్కహాల్ మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. అనుమతించిన పరిమితి 30 మైక్రోగ్రాములు మాత్రమే కాగా.. అంతకు నాలుగైదు రెట్లు ఉన్నట్లు గుర్తించారు. డ్రంక్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని ట్రాఫిక్​ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్‌ 105 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.