ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ ఇన్స్పెక్టర్

ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ ఇన్స్పెక్టర్

నల్గొండ, వెలుగు: భూ సర్వే రిపోర్టు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ నల్గొండ ఆర్డీవో ఆఫీస్​లో పని చేసే డిప్యూటీ ఇన్స్​పెక్టర్​ జి.పవన్ కుమార్  ఏసీబీ అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్  చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. భూ సర్వే రిపోర్ట్  కోసం ఓ వ్యక్తి డిప్యూటీ  ఇన్స్​పెక్టర్  పవన్ కుమార్‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించాడు. ఆ రిపోర్ట్  ఇవ్వడానికి రూ.35 వేలు లంచం డిమాండ్  చేసి, గతంలో రూ.20 వేలు అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నాడు.

ఆ తరువాత బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు శుక్రవారం మిగిలిన రూ.15 వేలు కలెక్టరేట్  సమీపంలో ఇచ్చాడు. పవన్​కుమార్​ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్ లో సోదాలు నిర్వహించారు. డిప్యూటీ ఇన్స్​పెక్టర్​ను అరెస్ట్  చేసి, హైదరాబాద్  నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.