- నారాయణఖేడ్ SBI బ్యాంకులో ఉద్యోగికి కరోనా నిర్ధారణ
సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కోవిడ్ 19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో బుధవారం బ్యాంకులో కార్యకలాపాలు నిలిపేసి బ్రాంచిని మూసివేశారు. కరోనా సోకడంతో వల్ల బ్యాంకు కార్యాలయాన్ని మొత్తాన్ని శానిటేషన్ చేసిన అనంతరం బ్యాంకు సేవలు ప్రారంభించడం జరుగుతుందని మేనేజర్ మిలింద్ కమలే తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంతంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సందర్భంగా బుధవారం యస్ బీ ఐ బ్యాంక్ ను మూసి వేయడం జరిగిందని, దయచేసి వినియోగదారులు సహకరించాలని బ్రాంచ్ మేనేజర్ కోరారు.
ఇవి కూడా చదవండి..
ఐఐటీ హైదరాబాద్లో 119 మందికి కరోనా
జీవో317 ఉద్యోగులకు యమపాశంగా మారింది
సిద్ధార్థ్ క్షమాపణపై స్పందించిన సైనా నెహ్వాల్
కరోనాపై ఆటో డ్రైవర్ అద్భుతమైన మెసేజ్