నిర్మాతగా మారిన సంజయ్ దత్

నిర్మాతగా మారిన సంజయ్ దత్

ఒకప్పుడు హీరోగా ఆకట్టుకున్న సంజయ్‌‌‌‌ దత్‌‌‌‌.. గత కొన్నాళ్లుగా డిఫరెంట్‌‌‌‌ క్యారెక్టర్స్‌‌‌‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ‘కేజీఎఫ్‌‌‌‌’ లాంటి చిత్రాల్లో ఆయన చేసిన నెగిటివ్‌‌‌‌ క్యారెక్టర్స్‌‌‌‌కు అద్భుతమైన స్పందన లభించింది. హీరోగా, విలన్‌‌‌‌గా మెప్పించిన ఆయన ఇప్పుడు నిర్మాతగానూ మారారు. త్రీ డైమన్షన్‌‌‌‌ మోషన్ పిక్చర్స్ పేరుతో క్రిందటేడాది కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన సంజూ, దీపక్ ముకుత్‌‌‌‌తో కలిసి ఓ హారర్ కామెడీ మూవీని నిర్మిస్తున్నారు.

మంగళవారం ఈ సినిమా టైటిల్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ‘ద వర్‌‌‌‌‌‌‌‌ జిన్‌‌‌‌ ట్రీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిద్ధాంత్ సచ్‌‌‌‌దేవ్ దర్శకుడు. సంజయ్‌‌‌‌ దత్‌‌‌‌తో పాటు సన్నీ సింగ్, మౌనీరాయ్, పాలక్ తివారీ, ఆసిఫ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ నటిస్తున్నారు. కామెడీ, హారర్‌‌‌‌‌‌‌‌ల పర్ఫెక్ట్‌‌‌‌ బ్లెండ్‌‌‌‌లా ఈ సినిమా ఉండబోతోందని, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్ గ్యారెంటీ అని చెబుతున్నారు సంజయ్ దత్. మొత్తానికి వరుస సీరియస్ రోల్స్‌‌‌‌ తర్వాత ఓ కామెడీ థ్రిల్లర్‌‌‌‌తో  ఆడియెన్స్  ముందుకొస్తున్నారు సంజూ. ఇదిలా ఉంటే మహేష్‌‌‌‌ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో విలన్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ కోసం సంజయ్‌‌‌‌ దత్‌‌‌‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.