టీమిండియాలో ఆడటానికి ఒకే ఒక్క అవకాశం ఎదురుచూస్తున్న యువ ఆటగాడు సంజు శాంసన్కు ఎట్టకేలకు అవకాశం లభించింది. వెస్టిండీస్తో జరిగే మూడు టీ20 సిరీస్కు సెలక్టర్లు సంజును ఎంపిక చేశారు.శిఖర్ ధావన్ స్థానంలో సంజుకు చోటు దక్కింది. మోకాలి గాయం కారణంగా ధావన్… వెస్టిండిస్తో డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్కు దూరమయ్యాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నిలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో ధావన్ మోకాలికి గాయమైంది. క్రీజును చేరుకునే సమయంలో డైవ్ చేయడంతో శిఖర్ ధావన్ కాలుకి కట్టె కోసుకోవడంతో… మోకాలికి 20 కుట్లు పడ్డాయి. దీంతో ఆయనకు రెస్ట్ ఇచ్చారు. మోకాలి గాయంతో ఎట్టకేలకు సంజు శాంసన్కు చోటు దక్కింది.
2015లో జింబాబ్వేపై ఒక టీ20 ఆడిన సంజు ఏడో స్థానంలో దిగి 19 పరుగులు చేశాడు. కెరీర్లో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న సంజు ప్రస్తుతం నిలకడగా ఆడుతున్నాడు. వికెట్ కీపింగ్లోనూ అదరగొడుతున్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా మొదటి టీ20 డిసెంబర్ 6న హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది.