గుండెల్ని పిండేస్తున్న సప్త సాగరాలు దాటి మూవీ.. ఒక్క షోతో థియేటర్స్ పెంచిన మేకర్స్

గుండెల్ని పిండేస్తున్న సప్త సాగరాలు దాటి మూవీ.. ఒక్క షోతో థియేటర్స్ పెంచిన మేకర్స్

కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘సప్త సాగరాలు ఎల్లో (సైడ్ ఏ)’. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’(Sapta Sagaralu Dhaati ) పేరుతో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో ఈనెల 22న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీకి తెలుగులో ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ గా ఈ మూవీ క్లైమాక్స్, మ్యూజిక్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 

ఈ సినిమాకు ఫస్ట్ డేకి బ్రేక్ ఈవెన్ రావడంతో పాటు తెలుగు స్టేట్స్ లో థియేటర్స్ కూడా పెంచారు మేకర్స్. ఆంధ్రాలో 10షోలు, తెలంగాణలో 16షోలు పెంచారు. దీంతో హీరో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ..తెలుగు ఆడియన్స్ నుంచి వస్తోన్న ప్రేమను పొందుతున్నాను. మీ ఆదరణ వల్ల సినిమా షోలు పెంచుతున్నాం. మీ ప్రేమకి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. ధన్యవాదములు.. అంటూ ట్వీట్ చేశారు. 

ఈ మూవీలో హీరో హీరోయిన్ల యాక్టింగ్,మ్యూజిక్ రెండింటిని వేరు చేసి చూడలేం. మొత్తం పాటలు మనల్ని తెరపై ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. నేపథ్య సంగీతం థియేటర్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఇక సినిమా చూసిన ప్రతీ ఒక్కరు హార్డ్‌ టచింగ్ సినిమా అని, గుండెల్ని పిండేసే సినిమా అని రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

రక్షిత్ శెట్టి కిరాక్ పార్టీ, అతడే శ్రీమన్నారాయణ, చార్లీ 777 మూవీస్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. సప్త సాగరాలు దాటి సైడ్ A, సైడ్ B అని రెండు భాగాలుగా వస్తోంది ఈ సినిమా.