ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన షెడ్యూల్ ఇదే..

ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన షెడ్యూల్ ఇదే..

ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడీగడ్డ పిల్లర్లు.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని.. కమిషన్ల కక్కుర్తి కోసం నాసిరకంగా మేడిగడ్డను నిర్మించారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వా మేడిగడ్డపై విచారణకు ఆదేశించింది.

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ప్రాజెక్టులపై అవినీతి ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించాలని..ప్రభుత్వ ఆధ్వర్యంలో బస్సును ఏర్పాటు చేస్తుందని అసెంబ్లీలో తెలిపారు. దీంతో రేపు మేడిగడ్డ సందర్శన షెడ్యూల్ ను ఖరారు చేశారు.

షెడ్యూల్ వివరాలు..

  • మంగళవారం ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో కట్టుదిట్టమైన భద్రతతో మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరనున్నారు.  
  • మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్యేల్యేలు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటుంది.
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు.
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అధికారులతో రివ్యూ చేస్తారు.
  • సాయంత్రం 5 గంటలకు మేడిగడ్డ నుంచి బయల్దేరి..రాత్రి 9.30 గంటలకుహైదరాబాద్‌కు చేరుకుంటారు.