గుడ్ న్యూస్..మేడ్చల్ టూ హైదరాబాద్...మేడ్చల్ టూ లింగంపల్లి మధ్య MMTS రైళ్లు..

గుడ్ న్యూస్..మేడ్చల్ టూ హైదరాబాద్...మేడ్చల్ టూ లింగంపల్లి మధ్య MMTS రైళ్లు..

MMTS ప్రయాణికులకు గుడ్ న్యూస్.  మేడ్చల్, లింగంపల్లి స్టేషన్ల మధ్య  కొత్త ఎంఎంటీఎస్ రైళ్ల సేవలను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. దీంతో పాటు మేడ్చల్, హైదరాబాద్ స్టేషన్ల మధ్య కూడా నూతన MMTS రైళ్లను నడపుతోంది. 

ప్రయాణీకులు ప్రయోజనం కోసం అక్టోబర్ 01 2023 నుండి అమలులోకి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే నూతన  టైమ్ టేబుల్‌లో  మేడ్చల్- - లింగంపల్లి, మేడ్చల్-  - హైదరాబాద్, మేడ్చల్ -- లింగంపల్లి ప్రాంతాల మధ్య ఆరు కొత్త MMTS సర్వీసులను ప్రారంభించింది. దీనికి అదనంగా ఉమ్దానగర్ టూ - సికింద్రాబాద్, ఫలక్‌నుమా టూ - సికింద్రాబాద్ మధ్య ఆరు MMTS సేవలను ప్రారంభించింది. 

ప్రయాణికుల కోసం  ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో  మేడ్చల్- - టూ  లింగంపల్లి సెక్షన్ మధ్య 4 MMTS సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. దీనితోపాటు మేడ్చల్  టూ  హైదరాబాద్ స్టేషన్ల మధ్య మొదటిసారిగా MMTS రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 

మేడ్చల్ టూ -లింగంపల్లి టూ -మేడ్చల్

 

మేడ్చల్ టూ  -హైదరాబాద్ టూ - మేడ్చల్

ఇటీవల కాచిగూడ నుంచి  - బెంగళూరు ( యశ్వంతపూర్ ) మధ్య వందే భారత్ రైలు సర్వీస్ ను ప్రారంభించింది. ప్రయాణికులు  ఈ వందే భారత్ రైలు సర్వీస్ ను అందుకునేందుకు వీలుగా ఉదయం, సాయంత్రం సమయంలో కాచిగూడ స్టేషన్ కు  చేరుకునేలా, ఉదయం లింగంపల్లి - ఉమ్దానగర్ నుండి రాత్రి సమయాల్లో ఫలక్ నుమా - లింగంపల్లి నుండి MMTS సర్వీసులు ప్రారంభించారు. 

వందే భారత్ సమయాలకు అనుగుణంగా  సవరించిన MMTS సేవలు