వైభవంగా ఉజ్జయిని మహంకాళీ బోనాలు

వైభవంగా ఉజ్జయిని మహంకాళీ బోనాలు

సికింద్రాబాద్  ఉజ్జయిని  మహంకాళి  బోనాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి.  తెల్లవారుజామున  3 గంటలకు  అమ్మవారికి  మొదటి బోనం  సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెల్లవారుజామునే అమ్మవారిని దర్శించుకొని…. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సతీసమేతంగా అమ్మవారికి వెండి బోనం సమర్పించారు.  టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.