Fire accident : ఇంకా దొరకని ముగ్గురి ఆచూకీ

Fire accident : ఇంకా దొరకని ముగ్గురి ఆచూకీ

సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంలో గల్లంతైన ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. స్టోర్స్ లో పనిచేస్తున్న వసీం, జునైద్, జహీర్  ఏమైపోయారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. బీహార్ కు చెందిన ఆ ముగ్గురు ఏడాదిగా స్టోర్స్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ నలుగురు వసీం, జునైద్, జహీర్ లోపలే ఉన్నట్లు చెప్పడంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు ముగ్గురు కూలీల కుటుంబసభ్యుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని ట్రేస్ చేసే ప్రయత్నం చేయగా మొబైల్ సిగ్నల్స్ ఆ ఏరియాలోనే గుర్తించారు.