ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

కుల్గాం: టాప్ లష్కర్ ఏ తొయిబా టెర్రిరిస్ట్ తోపాటు మరో ఆపరేటివ్ ను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టారు. జమ్మూ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో సోమవారం భద్రతా దళాలకు టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో వీరు చనిపోయారు. ఈ కాల్పుల్లో మృతి చెందిన ఆపరేటివ్ కేటగిరీ ఏ టెర్రరిస్టు అని సమాచారం. అలాగే చనిపోయిన లష్కర్ కమాండర్ చాన్నాళ్లుగా యాక్టివ్ గా ఉంటూ ఎక్కువ సంఖ్యలో టెర్రరిస్టు యాక్టివిటీస్ లో పాల్గొన్నాడని తెలుస్తోంది. టెర్రరిస్టులకు 34వ రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్ఆర్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్) దళాల జాయింట్ టీమ్ కు మధ్య మంజ్గమ్ ప్రాంతంలో సోమవారం ఈ ఎన్ కౌంటర్ జరిగింది. మిర్వానీ విలేజ్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ తనిఖీలు నిర్వహించారు. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించడానికి మునుపే ఆ విలేజర్స్ ను సెక్యూరిటీ ఫోర్సెస్ ఖాళీ చేయించారు. ఈ నెల 19న నవకాదల్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ జరిపిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.