రేవంత్ రెడ్డికి సెక్యూరిటి తొలగింపు

రేవంత్ రెడ్డికి సెక్యూరిటి తొలగింపు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సర్కారు షాక్ ఇచ్చింది. రేవంత్ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. నిన్నటి ( ఆగస్టు 16)  నుంచి సెక్యూరిటీ లేకుండానే రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. ఇటీవల 4+4 భద్రతను 2+2కు ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు పూర్తిగా భద్రతను ప్రభుత్వం తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. 2 నెలల క్రితం తనకు భద్రత కల్పించాలని రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.ఎలాంటి కారణాలు లేకుండానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్ మెన్లను తొలగించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.