ఎమ్మెల్యే కారును ఢీకొన్న బైకు

ఎమ్మెల్యే కారును ఢీకొన్న బైకు
  •  ఒకరు మృతి.. ఎమ్మెల్యేకు గాయాలు

హైదరాబాద్: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి  కారును బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి తరఫున ప్రచారానికి వెళ్లారు. ప్రచారం ముగించుకొని తిరిగి వస్తుండగా ఓ బైకు ఎమ్మెల్యే కారును ఢీకొట్టింది.

ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కసిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన మరో వ్యక్తిని కుల్వకుర్తి ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు.