సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఏడు నెలల బాబు కిడ్నాప్‌

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఏడు నెలల బాబు కిడ్నాప్‌
  • మద్యం మత్తులో దంపతుల మధ్య గొడవ
  • అదును చూసి బాబును ఎత్తుకెళ్లిన మహిళ 
  • కిడ్నాపర్​ చెన్నైలో ఉన్నట్లు పోలీసుల అనుమానం

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఏడు నెలల బాబు కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన అజయ్, పింకీదేవి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి పటాన్‌‌‌‌‌‌‌‌చెరులోని ఇస్నాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నారు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అజయ్, పింకి దంపతులకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ నెల 2న సొంతూరికి వెళ్లేందుకు వారు తమ నలుగురు పిల్లలతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌కు వచ్చారు. 5వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు డీడీ ఉపాధ్యాయ జంక్షన్ వెళ్లే ట్రైన్ ఉండటంతో వారు రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలోనే ఉంటున్నారు. 

ఈ నెల 4న సాయంత్రం 5 గంటల సమయంలో భర్త అజయ్ మద్యం తాగి వచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అజయ్ కోపంగా బ్యాగు తీసుకుని తాను తిరిగి ఇస్నాపూర్ వెళ్తానంటూ అక్కడ నుంచి కొంత దూరం వెళ్లాడు. భర్తను ఆపేందుకు పింకి తన పిల్లలను అక్కడే వదిలిపెట్టి అజయ్‌‌‌‌‌‌‌‌ వెనకాలే వెళ్లింది. ఇద్దరూ దారిలో మరోసారి గొడవ పడ్డారు. కొద్దిసేపటి తర్వాత వారు తిరిగి స్టేషన్‌‌‌‌‌‌‌‌కు రాగా, అక్కడ ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నారు. తమ ఏడు నెలల బాబు కన్నయ్య కనిపించలేదు. 

అదే రోజు రాత్రి గోపాలపురం పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, బాలుడిని ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆ మహిళ బాబుతో పాటు రైలులో చెన్నైకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్పెషల్ టీమ్‌‌‌‌‌‌‌‌లు మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.