
- మలక్పేట నల్గొండ చౌరస్తాలో సీవరేజీ పనులను పరిశీలించిన అశోక్రెడ్డి
- ఫుడ్ వేస్టేజీని మాన్హోల్లోకి మళ్లించిన హోటల్ కు రూ.10 వేల ఫైన్
- సిల్ట్ చాంబర్నిర్మించుకోకపోతే హోటల్సీజ్ చేయాలని బల్దియాకు సూచన
హైదరాబాద్ సిటీ, వెలుగు: మలక్పేట నల్గొండ చౌరస్తాలో జరుగుతున్న సీవరేజ్ రిపేర్లను వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. కొద్ది రోజులుగా అక్కడి అక్బర్ప్లాజా వద్ద మురుగు సమస్య తలెత్తి ట్రాఫిక్ కు ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే.. 20 ఏండ్ల కింద వేసిన సీవరేజ్ లైన్శిథిలమైపోవడంతో అవుట్లెట్ లేక వర్షం కురిసినప్పుడు మురుగు పొంగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇదే ప్రాంతంలో బల్దియా వాననీటి కాల్వ ఉండడం, ట్రాఫిక్ రద్దీ కారణంగా సీవరేజ్ లైన్లు ధ్వంసమైన ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించలేకపోయారు. ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆ ప్రాంతాన్ని విజిట్చేసి నల్గొండ చౌరస్తా నుంచి మలక్పేట ఆర్యూబీ వరకు కొత్త సీవరేజ్ లైన్ల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. కొత్త లైన్తో తాత్కాలికంగా మురుగు సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. సమీపంలోని బిల్డింగుల నుంచి వస్తున్న మురుగును ఎక్కడికక్కడే కాకుండా ఒకే అవుట్లెట్ వద్ద లింక్చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోని అన్నీ సీవరేజ్ లైన్లను, మ్యాన్హోల్స్ను డీసిల్టింగ్ చేసి మురుగు పొంగకుండా చూడాలన్నారు. శాశ్వత పరిష్కారంకోసం ఇరు శాఖల అధికారులు సర్వే నిర్వహించాలని అన్నారు. అలాగే సిటీలోని సీవరేజ్, వాననీటి కాలువలు అనుసంధానమయ్యే పాయింట్లను గుర్తించాలని, ఆ ప్రాంతాల్లో రెండు లైన్లను వేరువేరుగా నిర్మిస్తే ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు.
10 రోజులు టైం..
నల్గొండ చౌరస్తాకు ఆనుకొని ఉన్న భవనంలో హోటల్ యజమాని తన సీవరేజ్ లైన్ను నేరుగా వాటర్ బోర్డు సీవేజ్నెట్వర్క్కు కలపడంతో అందులోకి ఫుడ్వేస్టేజీతోపాటు ఇతర వ్యర్థ పదార్థాలు వెళ్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో మ్యాన్హోళ్లు నిండిపోయి రోడ్డుపై మురుగు పారుతోంది. గుర్తించిన ఎండీ అశోక్రెడ్డి నిర్లక్ష్యం వహించిన హోటల్ యజమానికి రూ.10 వేల ఫైన్వేయాలని అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో సిల్ట్ చాంబర్ నిర్మించుకోకపోతే హోటల్ను సీజ్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, సీజీఎం నాగేందర్, జీఎం ఇతర అధికారులు,హైడ్రా అధికారులు పాల్గొన్నారు.