నల్గొండ చౌరస్తా నుంచి ఆర్‌‌‌‌యూబీ వరకు సీవ‌‌‌‌రేజ్‌‌‌‌ లైన్

నల్గొండ చౌరస్తా నుంచి ఆర్‌‌‌‌యూబీ వరకు సీవ‌‌‌‌రేజ్‌‌‌‌ లైన్
  • మలక్​పేట నల్గొండ చౌరస్తాలో సీవరేజీ పనులను పరిశీలించిన అశోక్​రెడ్డి 
  • ఫుడ్​ వేస్టేజీని మాన్​హోల్​లోకి మళ్లించిన హోటల్ కు రూ.10 వేల ఫైన్
  • సిల్ట్​ చాంబర్​నిర్మించుకోకపోతే హోటల్​సీజ్​ చేయాలని  బల్దియాకు సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు:  మలక్‌‌‌‌పేట నల్గొండ చౌరస్తాలో జరుగుతున్న సీవరేజ్ రిపేర్లను వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. కొద్ది రోజులుగా అక్కడి అక్బర్​ప్లాజా వద్ద మురుగు సమస్య తలెత్తి ట్రాఫిక్ కు ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే.. 20 ఏండ్ల కింద వేసిన సీవ‌‌‌‌రేజ్‌‌‌‌ లైన్​శిథిలమైపోవడంతో అవుట్‌‌‌‌లెట్ లేక‌‌‌‌ వర్షం కురిసినప్పుడు మురుగు పొంగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇదే ప్రాంతంలో బల్దియా వాననీటి కాల్వ ఉండడం, ట్రాఫిక్ రద్దీ కారణంగా సీవ‌‌‌‌రేజ్‌‌‌‌ లైన్లు ధ్వంసమైన ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించలేకపోయారు. ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆ ప్రాంతాన్ని విజిట్​చేసి నల్గొండ చౌరస్తా నుంచి మలక్‌‌‌‌పేట ఆర్‌‌‌‌యూబీ వరకు కొత్త సీవ‌‌‌‌రేజ్‌‌‌‌ లైన్ల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. కొత్త లైన్​తో తాత్కాలికంగా మురుగు సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. సమీపంలోని బిల్డింగుల నుంచి వస్తున్న మురుగును ఎక్కడికక్కడే కాకుండా ఒకే అవుట్‌‌‌‌లెట్‌‌‌‌ వద్ద లింక్​చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోని అన్నీ సీవ‌‌‌‌రేజ్‌‌‌‌ లైన్లను, మ్యాన్‌‌‌‌హోల్స్​ను డీసిల్టింగ్ చేసి మురుగు పొంగకుండా చూడాలన్నారు. శాశ్వత పరిష్కారంకోసం ఇరు శాఖల అధికారులు సర్వే నిర్వహించాలని అన్నారు. అలాగే సిటీలోని సీవరేజ్, వాననీటి కాలువలు అనుసంధానమయ్యే పాయింట్లను గుర్తించాలని, ఆ ప్రాంతాల్లో రెండు లైన్లను వేరువేరుగా నిర్మిస్తే ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. 

10 రోజులు టైం.. 

నల్గొండ చౌరస్తాకు ఆనుకొని ఉన్న భవనంలో హోటల్ యజమాని తన సీవరేజ్ లైన్​ను నేరుగా వాటర్ బోర్డు సీవేజ్​నెట్​వర్క్​కు కలపడంతో అందులోకి ఫుడ్​వేస్టేజీతోపాటు ఇతర వ్యర్థ పదార్థాలు వెళ్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో మ్యాన్‌‌‌‌హోళ్లు నిండిపోయి రోడ్డుపై మురుగు పారుతోంది. గుర్తించిన ఎండీ అశోక్​రెడ్డి నిర్లక్ష్యం వహించిన హోటల్ యజమానికి రూ.10 వేల ఫైన్​వేయాలని అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో సిల్ట్‌‌‌‌ చాంబర్ నిర్మించుకోకపోతే హోటల్‌‌‌‌ను సీజ్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, సీజీఎం నాగేందర్, జీఎం ఇతర అధికారులు,హైడ్రా అధికారులు పాల్గొన్నారు.