ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలె: ఎస్ఎఫ్ఐ వినతి

ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలె: ఎస్ఎఫ్ఐ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు కోరారు. బుధవారం ఆయన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు బి.శంకర్, అశోక్ రెడ్డి, రమేశ్ తదితరులతో కలిసి సచివాలయం వెళ్లి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిశారు. ఈ అంశంపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ... ప్రైవేటులో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని సమస్యలు పరిష్కరించాలని కోరారు. మన ఊరు మన బడి పనులను స్పీడప్ చేయాలని, పెండింగ్​ లో ఉన్న బిల్లులను రిలీజ్ చేయాలని నాగరాజు పేర్కొన్నారు.