హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఐడీ జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల అమలును నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజ కిరణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విదేశాల్లో ఉన్న శైలజ తరఫున వి.రత్నకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి పీఎస్ లో నమోదైన కేసుల్లో కఠిన చర్యలు తీసుకోరాదన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించేలా లుక్ ఔట్ నోటీసు ఉందని పిటిషన్లో ఏపీ సీఐడీ వినతి మేరకు ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన లుక్ ఔట్ నోటీసును రద్దు చేయాలని కోరారు.
అమెరికాలో ఉన్న శైలజ, జూన్ 3న తిరిగి వచ్చేందుకు టికెట్ తీసుకున్నారని, సీఐడీ విచారణకు శైలజ సహకరిస్తున్నప్పటికీ లుక్ ఔట్ నోటీసు ఇవ్వడం అన్యాయమన్నారు. జూన్ 6న విచారణకు హాజరయ్యేందుకు అమెరికా నుంచి జూన్ 3న వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో లుక్ ఔట్ నోటీసులు అమలు చేయొద్దని పిటిషన్ లో కోరారు.