పిల్లలతో కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేసిన శిల్పాశెట్టి

పిల్లలతో కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేసిన శిల్పాశెట్టి

నికమ్మ సినిమా ప్రమోషన్ లో సినీనటి శిల్పాశెట్టి ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ బిజీ షెడ్యూల్ లో కూడా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించింది. తన కొడుకు వియాన్, కుమార్తె సమీషాతో కలిసి డిన్నర్ చేసేందుకు రెస్టారెంట్ కు వెళ్లారు. ఈ ముగ్గురు ముంబయి ఖార్లోని బాస్టియన్ రెస్టారెంట్ కు వెళ్లి డిన్నర్ చేశారు. అంతేకాదు తన పిల్లలతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించింది. శిల్పా శెట్టి తెల్లటి టీ షర్టు, పసుపు ప్యాంటు ధరించి స్టైలిష్ లుక్ లో కనిపించింది. అమ్మతో డిన్నర్ చేసేందుకు పిల్లలు కూడా ఎంతో ఉత్సాహం చూపించారు. అమ్మతో డిన్నర్ డేట్ కోసం వియాన్ నల్లటి టీ షర్ట్ మ్యాచింగ్ ప్యాంటు ధరించాడు. ఆకుపచ్చ జాకెట్ తో స్టైల్ గా కనిపించాడు. సమీషా తెల్లటి టీషర్టు ధరించి ఎంతో అందంగా కనిపించింది. డిన్నర్ అనంతరం శిల్పాశెట్టి తన పిల్లలను చేతులతో పట్టుకుని కారు దగ్గరకు తీసుకువెళ్లింది. కొద్దిదూరం నడిచిన కూతురు సమీషాను మాత్రం తన చేతలతో ఎత్తుకుని కారు వద్దకు తీసుకెళ్లింది. 
శిల్పాశెట్టి పిల్లలతో సరదాగా గడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.